Breaking: సీబీఐ విచారణకు మరోసారి కడప ఎంపీ అవినాశ్ రెడ్డి

by Disha Web Desk 16 |
Breaking: సీబీఐ విచారణకు మరోసారి కడప ఎంపీ అవినాశ్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు మరోసారి హాజరుకానున్నారు. వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో ఆయనను ఇప్పటికే సీబీఐ ఓసారి విచారించింది. ఎప్పుడు పిలిచినా మళ్లీ రావాలని సూచించింది. తాజాగా మరోసారి విచారించేందుకు ఎంపీ అవినాశ్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న విచారణకు హాజరుకావాలని వాట్సాప్ ద్వారా అవినాశ్ ఫోన్‌కు నోటీసులు పంపింది. ఈ మేరకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి అవినాశ్ రెడ్డి వెళ్లనున్నారు.

కాగా తెలంగాణ సీబీఐకు వివేకా కేసు బదిలీ అయినప్పటి నుంచి విచారణలో వేగం పుంజుకుంది. ముగ్గురు నిందితులను ఇప్పటికే అధికారులు విచారించారు. అంతేకాదు వారిని హైదరాబాద్ చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో మరోసారి అవినాశ్ రెడ్డికి నోటీసులివ్వడంతో ఆయన అనుచరుల్లో ఉత్కంఠ నెలకొంది.

Also Read...

Vallabhaneni Vamsi: చంద్రబాబు పెద్ద సైకో.. లోకేశ్ పిల్ల సైకో..!

Next Story